కాంగ్రెస్ మాట నిలబెట్టుకోవాలి
Warning: array_key_exists() [function.array-key-exists]: The second argument should be either an array or an object in /home/mancheri/public_html/wp-content/plugins/wp-postviews/wp-postviews.php on line 126
One Comment
-టీడీపీ జిల్లా అధ్యక్షుడు గోనె హన్మంతరావు
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు విషయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని, ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ ప్రణబ్ముఖర్జీకి ఇచ్చిన లేఖ కు కట్టుబడి ఉంటుందని టీడీపీ జిల్లా అధ్యక్షుడు గోనె హన్మంతరావు అన్నారు. మంగళవారం ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమం నిర్వహించిన అనంతరం ఐబీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
తెలంగాణ కోసం పోరు చేయడానికి టీడీపీ తెలంగాణ ఫోరంతో సీపీఐ కలిసివస్తుందని చెప్పారు. మరో కొత్త జేఏసీ అధ్వర్యంలో ఉద్యమించడానికి సన్నాహలు చేస్తున్నట్లు తెలిపారు. నిత్యావసర వస్తువుల ధరలు అదుపు చేయడంలో పాలకులు విఫలమయ్యారని విమర్శించా రు. పెట్రోల్ ధర పెంచి ప్రజలపై మరింత భారం మోపారన్నారు. రాష్ట్రంలో ఏర్పడిన రాజకీయ అనిశ్చితతో అభివృద్ధి కుంటు పడిందన్నారు. సమవేశంలో టీడీపీ నాయకుడు కె.వి. ప్రతాప్, పట్టణ అధ్యక్షుడు బెల్లంకొండ మురళీధర్, ప్లోర్లీడర్ ముఖేశ్గౌడ్ పాల్గొన్నారు.


















Jai telangana
Leave your response!